నో కింగ్స్ ప్రొటెస్ట్స్ : ‘‘ఇది అమెరికా, ఇక్కడ అధికారం ప్రజలదే’’ అంటూ ట్రంప్‌కు వ్యతిరేకంగా నినదించిన 80 లక్షలకుపైగా జనం.. 8 చిత్రాలలో

చదివే సమయం: 3 నిమిషాలు

అమెరికా అంతటా పలు నగరాల్లో ట్రంప్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసనలు జరిగాయి. 'నో కింగ్స్' పేరుతో ఇలా ర్యాలీలు జరగడం ఇది మూడోసారి.

శనివారం జరిగిన ఈ నిరసనల్లో 80 లక్షలకు పైగా ప్రజలు పాల్గొన్నారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అమలు చేస్తున్న విధానాలు, ఇరాన్ యుద్ధం, వలసలను కట్టుదిట్టం చేయడం, పెరుగుతున్న జీవన వ్యయానికి వ్యతిరేకంగా ప్రజలు ఈ నిరసన చేశారు.

'ట్రంప్ మనల్ని ఒక నియంతలా పాలించాలని చూస్తున్నారు. కానీ, ఇది అమెరికా. ఇక్కడ అధికారం ప్రజలది. రాజులు అవ్వాలనుకునే వారిది, వారి బిలియనీర్ స్నేహితులది కాదు' అని నిర్వాహకులు వ్యాఖ్యానించారు.

'ఇవన్నీ నిజమైన నిరసనలు కావు. ట్రంప్‌పై ద్వేషంతో జరుగుతున్నవే ' అని వైట్ హౌస్ ప్రతినిధి ఈ నిరసనలను కొట్టిపారేశారు.

'ఈ నిరసనల గురించి వార్తలు రాసేందుకు డబ్బులు తీసుకునే రిపోర్టర్లకు తప్ప మరెవరూ వీటిని పట్టించుకోరు' అని ఆయన విమర్శించారు.

అయితే ర్యాలీలో పాల్గొన్నవారి సంఖ్యను బీబీసీ స్వతంత్రంగా ధృవీకరించలేదు. గతంలో జరిగిన నో కింగ్స్ ప్రొటెస్ట్‌లోనూ ఇలాగే లక్షలాదిమంది ప్రజలు పాల్గొన్నట్టుగా అంచనా వేశారు.

అమెరికా వ్యాప్తంగా దాదాపు ప్రతి పెద్ద నగరంలోనూ శనివారం నాడు ప్రదర్శనలునిర్వహించారు. అలాగే చిన్న పట్టణాలలోనూ ప్రజలు గుమిగూడారు. పారిస్, లండన్‌లోనూ ఈ నిరసనలు జరిగాయి. మధ్యాహ్నం అంతా వాషింగ్టన్ డీసీ నడిబొడ్డు వీధులలో జనం ర్యాలీలు చేస్తూనే ఉన్నారు. నిరసనకారులు లింకన్ మెమోరియల్ మెట్లపై బారులు తీరారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)