కరోనా లాక్డౌన్: ప్రపంచవ్యాప్తంగా 8,00,000 దాటిన కోవిడ్ బాధితులు, 37,000 దాటిన మృతులు
అమెరికాలో కరోనావైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మొత్తం 1,64,610 మందికి వైరస్ సోకగా, ఇప్పటివరకు 3,170 మంది చనిపోయారు. ఆసియా పసిఫిక్ ప్రాంతం ఆర్థిక సంక్షోభం అంచున ఉందని ప్రపంచ బ్యాంకు ప్రకటించింది.
లైవ్ కవరేజీ
చైనాను హెచ్చరించిన వరల్డ్ బ్యాంక్
ఫొటో సోర్స్, Getty Images
కరోనావైరస్ మహమ్మారి వల్ల ఆసియాలో పేదరికం పరిధి పెరగవచ్చని ప్రపంచ బ్యాంక్ తన రిపోర్టులో ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ రిపోర్టులో కరోనావైరస్ వల్ల పర్యాటకం, వాణిజ్యం, వస్తువుల క్రయవిక్రయాల ఆధారిత ఆర్థికవ్యవస్థ ప్రమాదంలో పడిందని చెప్పింది.
దీనివల్ల ఆసియాలో చాలామంది జీవనోపాధిపై ప్రభావం పడుతుందని తెలిపింది.కరోనా వల్ల చైనా ఆర్థికవ్యవస్థ స్తంభిస్తుందని, దాని వృద్ధి రేటు 6.1 నుంచి 2.3 శాతానికి పడిపోవచ్చని చెప్పింది.
ఈ మహమ్మారి మరింత దారుణంగా మారితే చైనా ఆర్థిక వృద్ధి 0.1 శాతానికి కూడా చేరుకోవచ్చని, దాని చుట్టుపక్కల దేశాల ఆర్థిక పరిస్థితి కూడా దారుణంగా ఉంటుందని పేర్కొంది.
దిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో చాలామందికి కరోనా వ్యాపించి ఉంటుందనే వార్తలు రావడంతో ఉత్తరప్రదేశ్లోని మీరట్, ముజఫర్నగర్ జిల్లాను అప్రమత్తం చేశారు.
ఈ జిల్లాల నుంచి చాలామంది తబ్లీగీ జమాత్లో జరిగిన కార్యక్రమానికి వెళ్లినట్లు ప్రసార భారతి న్యూస్ సర్వీస్ చెప్పింది. మీరట్లో ఒక కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. 24 గంటలూ పరిస్థితిని సమీక్షిస్తున్నారని తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్ల కంటెంట్కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
కరోనావైరస్-నిజాముద్దీన్ ఘటనపై దిల్లీ సీఎం ప్రకటన
నిజాముద్దీన్లోని మర్కజ్ నుంచి తీసుకెళ్లిన వారిలో చాలా మందికి కరోనావైరస్ వ్యాపించి ఉంటుందని భావిస్తున్నారని, రెండు మూడు రోజుల్లో వారి రిపోర్టులు రావచ్చని దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చెప్పారు.
కరోనావైరస్ భయంతో అమెజాన్ సిబ్బంది ధర్నా
అమెరికాలో కరోనావైరస్ భయంతో ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ సహా చాలా కంపెనీల సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోంది.
అమెరికా ఫుడ్ డెలివరీ ఫర్మ్ ఇన్స్టాకార్ట్, అమెజాన్లోని కొంతమంది సిబ్బంది తమకు సంస్థలు తగిన ఆరోగ్య భద్రత కల్పించలేదంటూ ధర్నా చేశారు.
అమెజాన్ ఉద్యోగుల సంఘం నాయకుడు రాయిటర్స్ తో మాట్లాడుతూ తమకు సంస్థ తగినన్ని మాస్కులు అందించడం లేదని, ఒకే మాస్క్ చాలా రోజులపాటు ఉపయోగించాల్సి వస్తోందని ఫిర్యాదు చేశారు.
తబ్లీగీ జమాత్పై ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఆగ్రహం
కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ తబ్లీగీ జమాత్ను తీవ్రంగా విమర్శించారు.
“తబ్లీగీ జమాత్ ‘తాలిబాన్’ నేరం… ఇది నిర్లక్ష్యం కాదు. తీవ్రమైన నేరపూరిత చర్య. మొత్తం దేశమంతా ఒక్కటై కరోనాతో పోరాడుతున్న సమయంలో ఇలాంటి తీవ్రమైన నేరం క్షమించరానిది” అని ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్ల కంటెంట్కు బీబీసీ బాధ్యత వహించదు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్ల కంటెంట్కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
నిజాముద్దీన్ తబ్లీగీ జమాత్కు వెళ్లి వచ్చిన తమిళనాడు వాసులకు కూడా కరోనా ఉన్నట్టు తేలింది.
ఈ కార్యక్రమానికి తమిళనాడు నుంచి 1500 మంది హాజరయ్యారు. వీరిలో 50 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఏఎన్ఐ ధ్రువీకరించింది.
తాజాగా 50 కేసులతో తమిళనాడులోని మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 124కు చేరిందని తమిళనాడు హెల్త్ సెక్రటరీ చెప్పారని తెలిపింది.
కోవిడ్-19 నివారణ చర్యలు, విశాఖ సెంట్రల్ జైలు ఖైదీల తాత్కాలిక విడుదల
కోవిడ్ 19 వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖ సెంట్రల్ జైల్లో 7 ఏళ్ల శిక్ష అనుభవించిన ఖైదీలను తాత్కాలికంగా విడుదల చేసింది.
విశాఖ నగర పరిధిలో 71 మంది , విజయనగరం, శ్రీకాకుళం నగర పరిధిలో ఒక్కొక్కరు మొత్తం 73 మందిని విడుదల చేశారు. వీరిలో ఏడుగురు మహిళలు విశాఖ సెంట్రల్ జైల్ నుండి విడుదలయ్యారు.
జైలు నుంచి విడుదలైన అందరినీ ఒక నెల రోజులు పాటు హోమ్ క్వారంటైన్లో ఉంటారు. నెల రోజుల తర్వాత వీరందరూ తిరిగి విశాఖ సెంట్రల్ జైలుకు వెళ్తారు.
చట్ట పరమైన షరతుల ప్రకారం 73 మంది ఖైదీలు విడుదల చేశాం, వీరి కదలికలపై నిఘా ఉంచుతాం అని విశాఖ జిల్లా జైల్ అధికారులు చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా 8 లక్షలు దాటిన వైరస్ కేసులు... కుదేలైన విమానయాన రంగం, అమెరికాలో వేగంగా పెరుగుతున్న కోవిడ్ బాధితులు, స్టే ఎట్ హోమ్ వల్ల తేడా కనిపిస్తోందన్న బ్రిటన్
ఫొటో సోర్స్, Getty Images
కరోనావైరస్ వేగంగా విస్తరిస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా 8,00,049 మందికి ఈ వైరస్ సోకింది. మృతుల సంఖ్య 37,878కి చేరుకుంది.
భారతదేశంలో మొత్తం కేసుల సంఖ్య 1357కు చేరుకుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం ఇప్పటివరకు 32 మంది చనిపోయారు. కేరళలో అత్యధికంగా 221 కేసులు నమోదయ్యాయి. ఒక వ్యక్తి చనిపోయారు. మహారాష్ట్రలో 223 కేసులు నమోదు కాగా 8 మంది మృతి చెందారు.
అమెరికాలో అత్యధికంగా 1,64,610 మందికి కరోనావైరస్ సోకింది. మంగళవారం నాటికి 3,170 మంది వైరస్ బారిన పడి చనిపోయారు.
ఇటలీలో ఇప్పటికే 11,591 మంది ప్రాణాలు తీసిన ఈ వైరస్ మొత్తంగా 1,01,739 మందికి సోకింది. ఆ తరువాత స్థానంలో నిలిచిన స్పెయిన్లో 94,417 మంది వైరస్ బాధితులు నమోదయ్యారు. 8,189 మంది మృతి చెందారు.
చైనాలో వైరస్ సోకిన వారి సంఖ్య 82,272 వద్ద స్థిరంగా ఉండడమే కాకుండా కొత్తగా ఎవరూ చనిపోలేదని రిపోర్టులు సూచిస్తున్నాయి. ఈ దేశంలో ఇప్పటివరకు 3,309 మంది చనిపోయారు.
జర్మనీలో 67 వేల మందికి వైరస్ సోకినప్పటికీ మృతుల సంఖ్య అదుపులో ఉంది. ఇక్కడ ఇప్పటివరకు 650 మంది చనిపోయారు.
అయితే, ఫ్రాన్స్లో వైరస్ బాధితుల సంఖ్య 45వేల పైచిలుకే అయినప్పటికీ, ఇప్పటికే ఇక్కడ 3,030 మంది మృత్యువాత పడ్డారు.
ప్రపంచవ్యాప్తంగా విమానయానం రంగం కరోనా దెబ్బకు చతికిలపడిపోయింది. ప్రపంచంలోని సంపన్న విమానయాన సంస్థలలో ఒకటైన అమెరికన్ ఎయిర్లైన్స్ తాను 1200 కోట్ల డాలర్ల భృతి కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోబోతున్నట్లు తెలిపింది.
'తెలంగాణలో ఆర్థిక నిల్వల కోసమే ఉద్యోగుల జీతాలను రిజర్వు చేశాం', ఎవరి జీతాలూ ఎక్కడికీ పోవని చెప్పిన తెలంగాణ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్
కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఉద్యోగుల జీతాలను రిజర్వు చేశామని తెలంగాణ సీఎం సోమేశ్ కుమార్ తెలిపారు.
అత్యవసర పరిస్థితి వస్తే ప్రభుత్వం వద్ద ఆర్థిక నిల్వలు ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. ఆర్థిక పరిస్థితి కుదుట పడ్డాక అందరికీ జీతాలు చెల్లిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని సోమేశ్ కుమార్ చెప్పారు.
ఇదిలా ఉంటే, మద్యం షాపులు తెరవవచ్చంటూ ఇటీవల నకిలీ జీవోను తయారు చేసిన సన్నీ అనే వ్యక్తిని ఉప్పల్ ప్రాంతంలో అరెస్ట్ చేసినట్లు పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. నకిలీ వార్తలు ప్రచారం చేసే వారికి ఇదో హెచ్చరిక అవుతుందని ఆయన అన్నారు.
దిల్లీలోని నిజాముద్దీన్లో జరిగిన తబ్లీగీ జమాత్ కార్యక్రమంలో 1,700 మంది పాల్గొన్నారని అంచనా -సత్యేంద్ర జైన్
దిల్లీ నిజాముద్దీన్లోని మర్కజ్ భవన్లో జరిగిన తబ్లీగీ జమాత్ కార్యక్రమం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ కార్యక్రమంలో కరోనావైరస్ సోకిన వారు పాల్గొన్నట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో 1500 నుంచి 1700 మంది పాల్గొన్నారని అనుమానిస్తున్నామని దిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఏఎన్ఐ వార్తా సంస్థతో అన్నారు.
"ఈ ప్రాంతం నుంచి 1,033 మందిని తరలించాం. 300 మందిని పరీక్షల కోసం ఆస్పత్రికి పంపించాం. 700 మందిని క్వారెంటైన్కు పంపించాం" అని సత్యేంద్ర తెలిపారు.
ఇంకా, "దిల్లీలో విపత్తులు, సంక్రమిత వ్యాధుల చట్టం అమల్లో ఉన్న సమయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా నిర్వాహకులు పెద్ద తప్పు చేశారు. ఈ చట్టం ప్రకారం ఎక్కడ కూడా అయిదుగురి కంటే ఎక్కువ మంది ఒక చోట చేరకూడదు. ఈ చట్టం ఇప్పటికీ అమల్లో ఉంది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేను లెఫ్టినెంట్ గవర్నర్కు లేఖ రాశాను. వారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని దిల్లీ ప్రభుత్వం ఆదేశించింది" అని ఆయన చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్ల కంటెంట్కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
ఆంధ్రప్రదేశ్లో ఒకే రోజులో 17 కొత్త కరోనావైరస్ కేసులు, దిల్లీ, మదీనా, మక్కా నుంచి వచ్చినవారు, వారిని కలిసిన వారికి వైరస్
ఆంధ్రప్రదేశ్లో సోమవారం రాత్రి కొత్తగా 17 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దాంతో రాష్ట్రంలో కోవిడ్-19 కేసుల సంఖ్య 40కి చేరింది.
కొత్తగా నమోదైన కరోనా బాధితుల్లో ఒకరు మదీనా నుంచి వచ్చిన వారు. మక్కా నుంచి వచ్చిన కర్నాటక వాసులతో కలిసిన వారు ఇద్దరున్నారు. మిగిలిన వారంతా దిల్లీ నుంచి వచ్చినవారు, వారి బంధువులు.
కొత్త కేసులు ఎక్కువగా ప్రకాశం జిల్లాలో తేలాయి. జిల్లాల వారీగా కోవిడ్ బాధితుల వివరాలు:
ప్రకాశం: 11
విశాఖ: 6
గుంటూరు: 9
అనంతపురం: 2
తూర్పుగోదావరి: 4
కృష్ణా: 5
చిత్తూరు: 1
కర్నూలు: 1
నెల్లూరు: 1
కోలుకున్నవారిలో ఒకరు నెల్లూరు, మరొకరు విశాఖకు చెందినవారు.
ఫొటో సోర్స్, Getty Images
కరోనా ప్రభావం: తెలంగాణ ఉద్యోగుల జీతాల్లో కోత
కరోనావైరస్ ప్రభావం తెలంగాణ ఉద్యోగులపై పడింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రగతి భవన్లో సోమవారం ముఖ్యమంత్రి నేతృత్వంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన తరువాత ప్రబుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాలనే నిర్ణయం తీసుకున్నారు.
ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల వేతనాల్లో 75 శాతం కోత విధిస్తారు.
ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్ వంటి అఖిల భారత సర్వీసుల అధికారుల వేతనాల్లో 60 శాతం కోత విధించాలని నిర్ణయించారు. అలాగే, మిగతా అన్ని కేటగిరీల ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం కోత విధిస్తారు.
నాలుగవ తరగతి, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత విధిస్తారు.
ఇక, అన్ని రకాల పెన్షనర్ల వేతనాల్లో 50 శాతం కోత విధిస్తారు. నాలుగో తరగతి పెన్షనర్ల జీతాల్లో 10 శాతం కోత విధిస్తారు.
అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ గ్రాంటు పొందుతున్న సంస్థల ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మాదిరిగానే వేతనాల్లో కోత విధిస్తారు.
తెలంగాణలో 61కి తగ్గిన కేసుల సంఖ్య, ఒకే రోజు 13 మందికి వ్యాధి నయమైందని ప్రకటన, తెలంగాణలో సోమవారం కొత్తగా 6 కేసులు నమోదయ్యాయి. 13 మందికి వ్యాధి నయమైంది.
తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ సాయంత్ర 8 గంటలకు విడుదల చేసిన మీడియా బులెటిన్ రాష్ట్రంలో కొత్తగా 6 కరోనా కేసులు నమోదైనట్లు తెలిపింది. అయితే, ఇప్పటివరకు చికిత్స పొందుతున్న వారిలో సోమవారం ఒక్కరోజే 13 మందికి వ్యాధి నయమైనట్లు ప్రకటించింది. మొత్తంగా ఇప్పటివరకు రాష్ట్రంలో కోవిడ్-19 బాధితులు 14 మంది పూర్తిగా కోలుకున్నారు.
కొత్తగా నమోదైన 6 కేసులతో కలిపి రాష్ట్రంలోని కరోనా బాధితుల సంఖ్య 61కి చేరింది. సోమవారం ఒక వ్యక్తి కరోనావైరస్తో చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య రెండుకు చేరింది.
వలస కార్మికులను ఆదుకునే చర్యలు
అంతకుమందు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో చిక్కుకుపోయిన వివిధ రంగాల వలస కార్మికులను ఆదుకునేందుకు ప్రత్యేక జీఓ విడుదల చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో 3,35,669 మంది వలస కార్మికులు ఉన్నట్లు గుర్తించామని, వారిలో చాలా మంది భవన కార్మికులేనని, వారందరూ రాష్ట్ర అభివృద్ధిలో భాగం పంచుకోవడానికి వచ్చిన వారిగానే గుర్తిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం నాడు ప్రెస్మీట్లో చెప్పిన ప్రకారం వారికి రేషన్తో పాటు ఆర్థిక సహాయం అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని ఈ జీఓ తెలిపింది.
వలస కార్మికులకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం లేదా గోదుమ పిండి ఉచితంగా ఇవ్వడంతో పాటు 500 రూపాయల ఆర్థిక సహకారం అందిస్తారు. ఇందుకోసం దాదాపు 30 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది.
ప్రధాని నిధికి రిలయన్స్ రూ. 500 కోట్లు, ఓఎన్జీసీ రూ. 300 కోట్ల విరాళం, పీఎం కేర్స్ నిధికి కార్పొరేట్ సంస్థల విరాళం
రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ PM CARES నిధికి రూ. 500 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు పత్రికా ప్రకటన విడుదల చేసింది. ప్రధాని నిధికి ఇవ్వడంతో పాటు మాహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 5 కోట్ల చొప్పున విరాళం ఇస్తున్నట్లు రిలయన్స్ ఈ ప్రకటనలో తెలిపింది.
కోవిడ్-19 బాధితులకు చికిత్స అందించేందుకు భారతదేశంలో ప్రప్రథమంగా 100 పడకల ఆస్పత్రిని కేవలం రెండు వారాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు కూడా రిలయన్స్ తెలిపింది. అలాగే, దేశవ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో పలు సేవలు అందించేందుకు రిలయన్స్ సిద్ధమవుతోందని, రాబోయే 10 రోజుల్లో 50 లక్షల ఉచిత భోజనాలు సరఫరా చేస్తామని రిలయన్స్ తెలిపింది.
కరోనావైరస్పై పోరాడడంలో తమ వంతు చేయూతగా ఓఎన్జీసీ సంస్థ PM CARES నిధికి రూ. 300 కోట్లు విరాళంగా ప్రకటించింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) ఫండ్ నుంచి ఇస్తున్న ఈ మొత్తంతో పాటు తమ సిబ్బంది విరాళంగా ఇచ్చిన రెండు రోజుల జీతం మొత్తం రూ. 16 కోట్లను ప్రధాని నిధికి అందిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది.
దిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో వందల మందికి కరోనావైరస్ లక్షణాలు?, ఓ మతపరమైన వేడుకకు 200 మంది గుమికూడారు. వారిలో చాలా మందికి వైరస్ లక్షణాలు ఉన్నట్లు బయటపడింది.
ఫొటో సోర్స్, TWITTER@ANI
దిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో ఇటీవల నిర్వహించిన ఓ మతపరమైన వేడుకలో పాల్గొన్నవారిలో చాలా మందికి కరోనావైరస్ లక్షణాలు కనిపించాయి.
వార్తా సంస్థ పీటీఐ తెలిపిన సమాచారం ప్రకారం పోలీసులు ఈ ప్రాంతాన్ని దిగ్బంధం చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా ఇక్కడ దాదాపు 200 మంది మతపరమైన వేడుక కోసం గుమికూడారని పోలీసులు తెలిపారు.
"ఈ విషయం మా దృష్టికి రాగానే లాక్ డౌన్ ఉల్లంఘనకు సంబంధించి మేం నోటీసులు జారీ చేశాం" అని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
"అక్కడివారిలో చాలా మందికి కరోనావైరస్ లక్షణాలు కనిపించడంతో ఆస్పత్రికి తీసుకువెళ్ళి పరీక్షలు జరిపిస్తున్నాం" అని ఆ అధికారి తెలిపారు.
దిల్లీలో మార్చి 31 వరకు ఎటువంటి సామాజిక,రాజకీయ, మతపరమైన కార్యక్రమాలు జరపడానికి వీల్లేదంటూ ఈ నెల ప్రారంభంలోనే దిల్లీ ప్రభుత్వం నిషేధాజ్ఞలు జారీ చేసింది. నిరసన ప్రదర్శనల్లో కూడా 50 మందికి పైగా గుమి కూడదని కూడా ఆ ఆదేశాలు సూచించాయి.
కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ప్రధానమంత్రి మార్చి 25 నుంచి 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించారు. లాక్ డౌన్ ఉల్లంఘించేవారిపై పోలీసులు డ్రోన్లతో కూడా నిఘా ఉంచారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్ల కంటెంట్కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
నిజామాబాద్లో కల్లు మరణాలు, కల్లు దొరక్క మానసిక ఆందోళనకు గురై నలుగురు మరణించారు
నిజామాబాద్ జిల్లాలో కల్లు దొరక్క ఇప్పటికే ముగ్గురు చనిపోయారు. మరో వ్యక్తి కల్లు బాధితుడు వెంకటేశ్ లక్ష్మీ కెనాల్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
కల్లు దొరక్క మానసిక ఆందోళనకు గురైన వెంకటేశ్ పిచ్చి చేష్టల తో ముఫ్కాల్ మండలంలోని కాల్వలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడి మృత దేహాన్ని వెలికి తీసి కేసు నమోదు చేశారు.
అమెరికాలో 1,43,055 కరోనా కేసులు, ప్రపంచవ్యాప్తంగా 7.25 లక్షలు; 34,000 దాటిన మృతులు, భారతదేశంలో కరోనావైరస్ సోకిన వారి సంఖ్య 1024కు చేరింది. ఇప్పటివరకు 29 మంది చనిపోయారు.
ఫొటో సోర్స్, Getty Images
భారతదేశంలో కరోనావైరస్ సోకిన వారి సంఖ్య 1024కు చేరింది. ఇప్పటివరకు కోవిడ్-19 వల్ల 29 మంది చనిపోయారని భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్లో కోవిడ్-19 కేసులు ఎనిమిది జిల్లాల్లో మొత్తం 23 నమోదయ్యాయి. తెలంగాణలో కోవిడ్-19 కేసుల సంఖ్య 70కి చేరుకుంది.
సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు నమోదైన సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 7,24,945 మందికి కరోనావైరస్ సోకింది. మృతుల సంఖ్య 34,041కి చేరింది. అయితే, ఇప్పటివరకు 1,52,314 మంది వ్యాధి నుంచి కోలుకున్నారని జాన్స్ హాప్కిన్స్ కరోనావైరస్ రిసోర్స్ సెంటర్ గణాంకాలు సూచిస్తున్నాయి.
అమెరికాలో అత్యధికంగా 1,43,055 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత ఇటలీలో 97,689 కేసులు నమోదయ్యాయి. మూడో స్థానంలో ఉన్న చైనాలో వైరస్ సోకిన వారి సంఖ్య 82,156 వద్ద కొంత కుదురుగా ఉంది.
స్పెయిన్ కూడా 80 వేల కరోనావైరస్ కేసులతో చైనాను దాటేస్తోంది. అమెరికాలో 2,513, ఇటలీలో 10,779, స్పెయిన్లో 6,803 మరణాల నమోదయ్యాయి. చైనా తమ దేశంలో మృతుల సంఖ్యను 3,308 వద్ద కట్టడి చేయగలిగింది.
వలస కార్మికులకు తక్షణ సాయం చేయండి - కేంద్ర ప్రభుత్వానికి 200 మంది విద్యావేత్తలు, ఆర్థిక వేత్తలు, సామాజిక కార్యకర్తల విజ్ఞప్తి
కరోనావైరస్ కారణంగా ఈనెల 24వ తేదీ నుంచి భారతదేశ వ్యాప్తంగా విధించిన 21 రోజుల లాక్డౌన్తో వివిధ రాష్ట్రాల్లోని వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించి వారిని ఆదుకోవాలని 200 మంది విద్యావేత్తలు, ఆర్థిక వేత్తలు, సామాజిక కార్యకర్తలు కోరారు.
వారి తరపున ప్రముఖ ఆర్థిక వేత్త జీన్ డ్రెజ్ ఒక ప్రకటన విడుదల చేశారు.
దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించాలన్న నిర్ణయం ఎలాంటి ప్రణాళిక లేకుండా తీసుకున్న నిర్ణయమని, దేశంలోని 90 శాతం మంది కార్మికులపై దీని ప్రభావం ఎలా ఉంటుందోనని ఆలోచించలేదని పేర్కొన్నారు.
కేవలం 4 గంటల నోటీసుతో వెలువడిన ఈ ప్రకటనతో ప్రజలంతా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు.
పరిశ్రమలు మూసివేయడం, పనులన్నీ ఆపివేయడం, రవాణా సదుపాయాలను నిలిపివేయడంతో లక్షలాది మంది వలస కార్మికులు వందలాది కిలోమీటర్లు కాలి నడకన తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు పయనమయ్యారని వివరించారు.
దీంతో వీరందరికీ వైరస్ సోకే ప్రమాదం ఉందని, వీళ్లు మళ్లీ వైరస్ వ్యాప్తికి కూడా కారణం కావొచ్చునని ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించి అంగన్ వాడీ కేంద్రాలు, పంచాయితీ భవనాలు, ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, సామాజిక భవనాలు, జిల్లా, మండల కేంద్రాలు మొదలైన చోట్ల వీరికి ఆహారం, వైద్యం, పారిశుధ్య సదుపాయాలను ఏర్పాటు చేయాలని కోరారు.
మదీనా నుంచి వచ్చిన కరోనా పేషెంట్ కోలుకున్నారు - ఏపీ ప్రభుత్వం
మదీనా నుంచి విశాఖపట్నం వచ్చి, కరోనా లక్షణాలతో ఈనెల 17వ తేదీన ఆసుపత్రిలో చేరిన 65 ఏళ్ల పేషెంట్ నంబర్ 3 కోవిడ్-19 వ్యాధి నుంచి కోలుకున్నారని ఏపీ ప్రభుత్వం తెలిపింది.
ఆ పేషెంట్కు హైపర్ టెన్షన్, డయాబెటీస్ కూడా ఉన్నాయని ఈరోజు ఉదయం 10 గంటలకు విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.
టీబీసీడీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయ్కుమార్, డాక్టర్ అయ్యప్ప, నోడల్ ఆఫీసర్ డాక్టర్ విజయ్ బాబు, నర్సులు, సిబ్బంది ఎప్పటికప్పుడు ఈ పేషెంట్ను పర్యవేక్షిస్తూ తగిన మందులు అందిస్తూ వచ్చారని, దీంతో పేషెంట్ కోలుకున్నారని తెలిపింది.
ఆదివారం, సోమవారం నిర్వహించిన కోవిడ్-19 పరీక్షల్లో ఆయనకు వ్యాధి లేదని తేలిందని వివరించింది.
ఏపీలో మరో ఇద్దరికి కరోనావైరస్.. రాష్ట్రంలో 23కు చేరిన కోవిడ్-19 కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఇద్దరికి కరోనావైరస్ సోకినట్లు నిర్థరణ అయ్యిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
దీంతో రాష్ట్రంలో కోవిడ్-19 వ్యాధికి గురైన వారి సంఖ్య 23కు చేరింది.
పేషెంట్ 22 కాకినాడకు చెందిన 49 ఏళ్ల మగ వ్యక్తి అని, పేషెంట్ 23 రాజమండ్రికి చెందిన 72 ఏళ్ల వృద్ధుడు అని ప్రభుత్వం ఈరోజు ఉదయం 10 గంటలకు విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.
ఈ ఇద్దరు పేషెంట్లకు సంబంధించిన ప్రయాణ వివరాలను సేకరిస్తున్నామని తెలిపింది.
గత రాత్రి నుంచి ఇప్పటి వరకూ 33 రక్త నమూనాలను పరీక్షించగా అందులో 31 మందికి వైరస్ సోకలేదని తేలింది.
జిల్లాల్లో కోవిడ్ ఆస్పత్రులుగా గుర్తించిన అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా రక్త నమూనాలను సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది.
రాష్ట్రంలో 13 జిల్లాలకు గాను 8 జిల్లాల్లో కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి.
అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 6 కేసులు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నాలుగేసి చొప్పున, ప్రకాశం, తూర్పు గోదావరి జిల్లాల్లో మూడేసి చొప్పున, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి.
నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఇద్దరు పేషెంట్లు ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు.