కెన్యా దేశంలో యుగాండా అథ్లెట్ బెంజమిన్ కిప్లాగాట్ కత్తిపోట్లకు గురై మరణించినట్లు అక్కడి స్థానిక మీడియా తెలిపింది.
బెంజమిన్ కిప్లాగాట్ ఉగాండా తరఫున మూడు సార్లు ఒలింపిక్ గేమ్స్లో పాల్గొన్నాడు.
34 ఏళ్ల కిప్లాగాట్ కెన్యాలోని ఎల్డోరెట్ టౌన్లో, కారులో మెడ, ఛాతీలపై గాయాలతో కనిపించాడు. అథ్లెట్ల అత్యుత్తమ శిక్షణా కేంద్రంగా ఎల్డోరెట్ టౌన్ పేరొందింది.
కిప్లాగాట్ హత్యపై కెన్యా పోలీసులు విచారణ జరుపుతున్నామని తెలిపారు.
భారతీయ అభిమానులకు తెగ నచ్చేసిన పాకిస్తానీ క్రికెట్ షో.. అంతలా ఈ పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ఏం చేశారు?
బంగ్లాదేశ్ ఎన్నికలు: అమెరికా వైఖరికి భిన్నంగా చైనా వాదనకు భారత్ ఎందుకు మద్దతిస్తోంది
ఎర్ర సముద్రంలో నౌక హైజాక్కు ప్రయత్నం.. తిప్పికొట్టామన్న అమెరికా
ఫొటో సోర్స్, US NAVY
ఎర్ర సముద్రంలో హూతీ తిరుగుబాటుదారుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
మాయెస్క్ర్ హాంగ్ఝావూ నౌకను హైజాక్ చేసేందుకు హౌతీ తిరుగుబాటుదారులు ప్రయత్నించారని యూఎస్ మిలటరీ తెలిపింది.
హూతీ తిరుగుబాటుదారులు నాలుగు బోట్లలో ఆ నౌకను చుట్టుముట్టిన క్రమంలో, నౌక నుంచి వచ్చిన అలెర్ట్కు స్పందించి, దగ్గరలో ఉన్న హెలికాఫ్టర్లను సాయం కోసం పంపినట్లు తెలిపింది.
హైజాజ్కు ప్రయత్నించిన నాలుగు బోట్లలో మూడింటిని ధ్వంసం చేశామని, ఆ బోట్లు మునిగిపోయి, అందులోని వారు మరణించినట్లు తెలిపింది. నాలుగో బోట్ తప్పించుకుపోయిందని యూఎస్ మిలటరీ పేర్కొంది.
ఈ నేపథ్యంలో ఎర్ర సముద్ర మార్గంలో 48 గంటల పాటు తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రపంచంలోని అతిపెద్ద షిప్పింగ్ సంస్థ అయిన మాయెస్క్ర్ ప్రకటనలో తెలిపింది.
ఎందుకు దాడులు చేస్తున్నారు?
ఎర్రసముద్రం మార్గంలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై యెమెన్ కేంద్రంగా పనిచేస్తున్న హూతీ తిరుగుబాటుదారుల దాడులు చేస్తున్నారు.
వీరు హమాస్కు మద్దతుగా, ప్రధానంగా ఇజ్రాయెల్కు సంబంధించిన, ఇజ్రాయెల్కు వెళ్తున్న రవాణా నౌకలపై దాడులు చేస్తున్నారు. నవంబర్ 19వ తేదీ నుంచి మొదలైన దాడుల్లో ఇది 18వ దాడి.
న్యూజీలాండ్లో ప్రారంభమైన 2024 వేడుకలు.. ప్రజల సంబరాలు
ఫొటో క్యాప్షన్, న్యూజీలాండ్లో ప్రారంభమైన నూతన సంవత్సర వేడుకలు
న్యూజీలాండ్లో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి. అక్కడి స్థానిక కాలమానం ప్రకారం..2024 సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ఆక్లాండ్లో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆకాశంలో బాణాసంచాల వెలుగులు నిండాయి.
న్యూజీలాండ్లోని ఉత్తర ఐలాండ్, దక్షిణ ఐలాండ్లు ఒకే టైం జోన్లో ఉండగా, తూర్పున ఉన్న చాతాం ఐల్యాండ్ 45 నిమిషాల ముందు ఉంటుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్ల కంటెంట్కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
మానవ మలంతో విమాన ఇంధనం తయారు చేసిన సైంటిస్టులు
2024: సూపర్ ఎల్ నినో అంటే ఏంటి? దీని ప్రభావంతో భారత్లో ఈ ఏడాది కరవు తప్పదా
యుక్రెయిన్ దాడిలో తమ దేశస్తులు 20మంది మరణించారని ప్రకటించిన రష్యా
ఫొటో సోర్స్, Reuters
నైరుతి రష్యాపై యుక్రెయిన్ వైమానిక దాడులు జరిపిందని రష్యా ఆరోపించింది. యుక్రెయిన్ సరిహద్దుకు సమీపంలోని బెల్గోరోడ్లో శనివారం జరిగిన ఈ దాడిలో 20 మంది మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడినట్లు సమాచారం.
ఇది అత్యంత ఘోరమైన దాడుల్లో ఒకటిగా అక్కడి గవర్నర్ ఈ ఘటనను పేర్కొన్నారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నట్లు ఆయన తెలిపారు.
శనివారం నాటి దాడిలో సైన్యానికి చెందిన కొన్ని మౌలిక సదుపాయాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నట్లు యుక్రెయిన్ సైన్యంతో సంబంధం కొన్ని సోర్సులు వెల్లడించాయి.
రష్యాపై యుక్రెయిన్ చేసిన ఈ దాడి శుక్రవారం యుక్రెయిన్పై రష్యా దాడికి ప్రతిస్పందనగా భావిస్తున్నారు. శుక్రవారంనాటి రష్యా దాడిలో 39 మంది చనిపోయారు.
తాజాగా యుక్రెయిన్ జరిపిన దాడుల్లో యుక్రెయిన్ తయారీ ఓల్ఖా, చెక్ రిపబ్లిక్ తయారీ వాంపైర్ రాకెట్లను కూడా ఉపయోగించినట్లు రష్యా ఆరోపించింది.
అయితే, యుక్రెయిన్ దాడిలో చెక్ రిపబ్లిక్లో తయారైన ఆయుధాలను ఉపయోగించారనే రష్యా వాదనను బీబీసీ ధ్రువీకరించలేకపోయింది.
2023: చంద్రయాన్-3 సహా ఇస్రో సాధించిన చరిత్రాత్మక విజయాలు ఇవీ
ఇస్రో: పీఎస్ఎల్వీ-సీ58/ఎక్స్పోశాట్ లాంచింగ్కు కౌంట్డౌన్ ప్రారంభం, రేపే ప్రయోగం
ఫొటో సోర్స్, ISRO
ఇస్రో రేపు ప్రయోగించబోయే పీఎస్ఎల్వీ-సీ58/ఎక్స్పోశాట్ లాంచింగ్కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. రేపు ఉదయం 9.10 నిమిషాలకు శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది.
ఆదివారం ఉదయం 8.10 గం.లకు ప్రారంభమైన ఈ కౌంట్ డౌన్ రేపు ఉదయం 9.10 గం.లకు రాకెట్ ప్రయోగంతో ముగుస్తుంది.
ఎక్స్పోశాట్ అంటే ఎక్స్రే పోలారిమీటర్ శాటిలైట్ను ఈ ప్రయోగం ద్వారా అంతరిక్షంలో ప్రవేశపెడతారు. ఐదేళ్ల కాలపరిమితి ఉన్న ఎక్స్పోశాట్ ద్వారా అంతరిక్షంలో గ్రహాంతరాల నుంచి వచ్చే ఎక్స్ కిరణాల ప్రభావాన్ని భారతదేశం శాస్త్రీయంగా అధ్యయనం చేస్తుంది.
గుడ్ మార్నింగ్
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.