తమిళనాడులో 84.60, పశ్చిమ బెంగాల్లో 91.68 శాతం పోలింగ్
తమిళనాడు, పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది.
తమిళనాడులోని మొత్తం 234 స్థానాలకు, పశ్చిమ బెంగాల్లో మొదటి దశ పోలింగ్లో భాగంగా 152 స్థానాలకు గురువారం పోలింగ్ జరిగింది.
ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం, తమిళనాడులో 84.60 శాతం, బెంగాల్లో 91.68 శాతం పోలింగ్ నమోదైంది.
పశ్చిమ బెంగాల్లో రెండో దశ పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుంది.
ఈ ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడనున్నాయి.