బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ 2025: అయిదుగురు నామినీలు ఎవరెవరంటే...

వీడియో క్యాప్షన్, బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ 2025: అయిదుగురు నామినీలు వీరే
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ 2025: అయిదుగురు నామినీలు ఎవరెవరంటే...

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ (ఐస్వోటీ, ISWOTY) ఆరవ ఎడిషన్ నామినీల పేర్లు విడుదలయ్యాయి.

ఈ ఏడాది ఈ అవార్డు కోసం క్రికెటర్లు హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్, షూటర్ సురుచి సింగ్, అథ్లెట్ జ్యోతి యర్రాజి పోటీలో నిలిచారు.

2025లో భారత క్రీడాకారిణులు అందించిన కృషికి గాను, క్రీడల్లో మహిళలందరూ సాధించిన విజయాలకు గౌరవంగా ఈ అవార్డును బీబీసీ అందిస్తోంది.

బీబీసీ ఏర్పాటుచేసిన ఓ ప్యానెల్ ఈ అవార్డు కోసం అయిదుగురు భారతీయ క్రీడాకారిణులను నామినీలుగా ఎంపిక చేసింది.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్, క్రీడలు, మహిళలు

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)